Share News

దూసుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:46 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది.

దూసుకొచ్చిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

చెన్నరాయునిపల్లిలో విషాదం

పెద్దారవీడు, జూన్‌ 5: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయునిపల్లెకు చెందిన మేకల బ్రహ్మం (18), పోరెడ్డి చిన్న వెలుగొండయ్య (18) బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై మార్కాపురం వచ్చారు. పనులు పూర్తయిన అనంతరం తిరిగి చెన్నరాయునిపల్లికు వెళుతుండగా అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై వెంకట సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మార్కాపురం సర్వజన వైద్యశాలకు వెళ్లి మృతదేహాలను పరిశీలించి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 06 , 2024 | 12:47 AM