మూలనపడిన ఎత్తిపోతల పథకం
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:21 PM
వందలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథ కం అధికారుల నిర్లక్ష్యం వ లన ఏళ్ల తరబడి మూలనపడింది. బిగించిన మో టా ర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తుప్పుపట్టి పోతున్నా ప ట్టించుకున్న వారే లేరు. మండలంలోని తూర్పువెంకటాపురం పెద్దవాగుపై 2000లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. కొద్దిరోజులు పొలాలకు నీరు అందించిన అనతరం పైపులైన్లు లెవల్స్ ప్రకారం లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి.
![మూలనపడిన ఎత్తిపోతల పథకం](https://media.andhrajyothy.com/media/2023/20231205/6_12d2a00e2b.gif)
తుప్పుపట్టిపోతున్న సామగ్రి
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో రైతులు
దర్శి, జనవరి 1 : వందలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథ కం అధికారుల నిర్లక్ష్యం వ లన ఏళ్ల తరబడి మూలనపడింది. బిగించిన మో టా ర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తుప్పుపట్టి పోతున్నా ప ట్టించుకున్న వారే లేరు. మండలంలోని తూర్పువెంకటాపురం పెద్దవాగుపై 2000లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. కొద్దిరోజులు పొలాలకు నీరు అందించిన అనతరం పైపులైన్లు లెవల్స్ ప్రకారం లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. మ ళ్లీ కొద్దిరోజులు నీరందించే ప్ర యత్నం చేసినప్పటికీ విఫలమైంది. పూర్తి స్థా యిలో పైపులైన్లను లెవల్స్ ప్ర కారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖర్చు అధికమవుతుందనే ఉద్దేశంతో అ ధికారులు చాలకాలం పట్టిచుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పా టు నిధుల కొరత వలన మర్మతులకు నోచుకోలేదు. దీంతో ఏకంగా ఎత్తిపోతల పథకం మూలనపడింది. చుట్టుపక్కన సు మారు 200 ఎకరాలకు నీరు అం దించేందుకు ఏర్పాటైన ఈ పథకం మూలన పడడంతో రైతులకు తీరని అ న్యాయం జరిగింది. ఇప్పటికైనా పథకాన్ని పునరుద్ధరించి సాగునీటిని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.