Share News

ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించాలి

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:19 PM

నియోజకవర్గ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తూ, మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పోలీస్‌ అధికారులకు సూచించారు.

ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించాలి
పోలీస్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, జూన్‌ 8 : నియోజకవర్గ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తూ, మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పోలీస్‌ అధికారులకు సూచించారు. పార్టీ కార్యాలయంలో శనివారం డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌, వన్‌టౌన్‌, రూరల్‌ సీఐలు శేషగిరిరావు, నిమ్మగడ్డ సత్యనారాయణ, వేటపాలెం ఎస్‌ఐ సురే్‌ష ఎమ్మెల్యే కొండయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో సమీక్షించారు. నియోజకవర్గంలో నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు వేటపాలెం మండల అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే కొండయ్యను కలసి శుభాకాంక్షలు తెలిపారు. పలు గ్రామాల నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 08 , 2024 | 11:19 PM