టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:53 PM
మండలంలోని గాజులపల్లి గ్రామంలో 60 కుటుంబాల వారు వైసీపీ వీడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి కందల నారాయణరెడ్డి స మక్షంలో మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ ఓట్లను దండుకొన్న వైసీపీ నాయకులు అన్నివిధాలా మోసం చేశారని తెలిపారు. కందులతోనే వెలిగొండ ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా సాధ్యమ న్నారు. నారాయణరెడ్డి నాయకత్వం నచ్చి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
![టీడీపీలో చేరిన 60 వైసీపీ కుటుంబాలు](https://media.andhrajyothy.com/media/2024/20240215/10_041550abc0.gif)
కొనకనమిట్ల, ఫిబ్రవరి 20 : మండలంలోని గాజులపల్లి గ్రామంలో 60 కుటుంబాల వారు వైసీపీ వీడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి కందల నారాయణరెడ్డి స మక్షంలో మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ ఓట్లను దండుకొన్న వైసీపీ నాయకులు అన్నివిధాలా మోసం చేశారని తెలిపారు. కందులతోనే వెలిగొండ ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా సాధ్యమ న్నారు. నారాయణరెడ్డి నాయకత్వం నచ్చి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారికి కందుల కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బండారు వెంకటేశ్వర్లు, బత్తుల నారాయణ, బండారు రమణయ్య, వెంకట్రా వ్, ఏడుకొండలు, పెద్ద ఆలు, వెంకటకొండయ్య, చినవెంకటయ్య, బత్తుల రామయ్య, బత్తుల మాలకొండరాయుడు, కొండలరావు, బండారు కాశయ్య, వెంకటరావు, రమణ య్య, బత్తుల పెదమాలకొండయ్య, తిరుపాలు, బండారు శ్రీనివాసులు, శంకర్, తా ళ్లూరి సాంబ, తుళ్లూరి శంకర్, దోసపాటి ఏడుకొండలు, రమణయ్య పార్టీలో చేరారు.