325 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:50 PM
అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ అధికారులు పట్టుకున్నారు.

నాగులుప్పలపాడు, జూలై 5 : అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సెమెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ27యూబీ 5598 నంబరు గల లారీ 200 బస్తాల రేషన్ బియ్యం లోడుతో ఉప్పుగుండూరు నుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వైపు వెళుతుండగా బి.నిడమానూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో డీటీలు డేవిడ్, సీహెచ్ కృష్ణమోహన్, రామనారాయణరెడ్డి బృందం దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం బస్తాలను ఒంగోలులోని ఎఫ్సీఐ గోడౌన్కు తరలించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు డీటీ కృష్ణమోహన్ తెలిపారు. అలాగే శుక్రవారం ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లిలో 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.