Share News

జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:06 AM

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,22,470 మందికి చేరింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు కోసం ఈనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది.

జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు

మహిళలే అధికం

ఒంగోలు నియోజకవర్గం ఫస్ట్‌.. ఎర్రగొండపాలెం లాస్ట్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 26 : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,22,470 మందికి చేరింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు కోసం ఈనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది. శుక్రవారం తుది జాబితా ప్రకటించింది. జనవరిలో ప్రకటించిన జాబితాలో మొత్తం 18,14,371 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా 8,099 ఓట్లు పెరిగి ఆ సంఖ్య 18,22,470కి చేరింది. వీరిలో పురుష ఓటర్లు 9.07,980, మహిళా ఓటర్లు 9,14,379, ఇతరులు 111 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 6,369 మంది అధికం. అసెంబ్లీ నియోజకవార్గల వారీ గా చూస్తే 2,40,242 మం ది ఓట్లతో ఒంగోలు ప్రథమస్థానంలో ఉండగా, 2,07,214 మంది ఓటర్లతో ఎర్రగొండపాలెం చివరి స్థానంలో ఉంది.

Updated Date - Apr 27 , 2024 | 01:06 AM