Share News

పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలు

ABN , Publish Date - Jun 29 , 2024 | 06:27 AM

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించాలని ప్రభుత్వం సహకారశాఖను ఆదేశించింది.

పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలు

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించాలని ప్రభుత్వం సహకారశాఖను ఆదేశించింది. అధికారిక పర్సన్‌ ఇన్‌ చార్జిలను నియమించే అధికారం జిల్లా సహకార శాఖ అధికారులకు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • మత్స్యకార సమాఖ్య పర్సన్‌ ఇన్‌చార్జిగా కమిషనర్‌

ఏపీ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిగా మత్స్యశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. మత్స్యకార సమాఖ్యకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగే వరకు లేదా ఈ ఏడాది డిసెంబరు 2వరకు పర్సన్‌ ఇన్‌చార్జిగా కమిషనర్‌ వ్యవహరించనున్నారు.

  • ఆక్వా అథారిటీ వైస్‌ చైర్మన్‌ రాజీనామా ఆమోదం

ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ కో వైస్‌ చైర్మన్‌ పదవికి వడ్డి రఘురామ్‌ రాజీనామా చేశారు. దానిని ఆమోదిస్తూ గెజిట్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - Jun 29 , 2024 | 06:27 AM