ఒంటి కాలిపై నిలబడి నిరసన
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:15 PM
: మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి కృష్ణమోహన్ శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవాధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సమస్యలు
![ఒంటి కాలిపై నిలబడి నిరసన](https://media.andhrajyothy.com/media/2023/20231205/1kvl4_87dacf2782.jpg)
కావలిటౌన్, జనవరి 1: మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి కృష్ణమోహన్ శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవాధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు తురక శీనయ్య, ఓ రమేష్, బీ రమేష్, మల్లికార్జున, బాబు, రాజేశ్వరి, అనిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.