జాతి గర్వించదగ్డ ముద్దుబిడ్డ అంబేడ్కర్
ABN , Publish Date - Jan 08 , 2024 | 11:12 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శప్రాయులని, జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డని ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్రంకురోడ్డు బ్రిడ్జి కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
![జాతి గర్వించదగ్డ ముద్దుబిడ్డ అంబేడ్కర్](https://media.andhrajyothy.com/media/2023/20231205/1bttr8_f0b778ae25.jpg)
కావలిటౌన్, జనవరి8: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శప్రాయులని, జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డని ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్రంకురోడ్డు బ్రిడ్జి కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 19న విజయవాడలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారన్నారు. 9రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించుకుంటు న్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్కుమార్, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షుడు పందిటి కామరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్న, కుందుర్తి కామయ్య, కేతిరెడ్డి శివకుమార్, కేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు : జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా సోమవారం బీఆర్ అంబేడ్కర్కు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సబ్ కలెక్టరు విద్యాధరి, మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, డీఎల్డీవో పద్మజ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాసంఘాల నాయకులుపాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్కాలనీ, ప్రకాశం కాలనీలలోని అంబేడ్కర్ విగ్రహాలకు, మున్సిపాలిటీ పరిధిలోని దూబగుంట వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాలతో అలంకరించి నివాళులు అర్పించారు.
వలేటివారిపాలెం : మండలంలోని బడేవారిపాలెం, నేకునాంపురం, వలేటివారిపాలెం, తదితర గ్రామాల్లో జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహలకు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడేవారిపాలెం, వలేటివారిపాలెం ఎంపీడీవో కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీపీ పీ మౌనిక, జడ్పీటీసీ సభ్యురాలు ఈ భారతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుందరమ్మ, వలేటివారిపాలెం, నేకునాంపురం గ్రామ సచివాలయల్లో సర్పంచులు సాదు శ్రీలత, కొల్లూరి లక్షమ్మలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిదులచే ప్రతిజ్ఞ చేయించారు.
బిట్రగుంట : బోగోలు మండలంలోని అధికారులు,సచివాలయ సిబ్బంది జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యంగ పీఠిక ప్రమాణం చేశారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రమాణం చేయించారు. తహసీల్దారు హేమంత్ కుమార్, ఎంపీడీవో వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
--------------------