చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
ABN , Publish Date - Jan 06 , 2024 | 10:40 PM
కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కనిగిరి వెళ్లిన వీరంతా వైసీపీని వీడి తెలుగుదేశంలో చే
![చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/6kdk2_bad93a4d38.jpg)
కందుకూరు, జనవరి 6: కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కనిగిరి వెళ్లిన వీరంతా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉలవపాడు మండలం కృష్ణాపురం సర్పంచి మందాడి సుశీలమ్మ, వైసీపీ నాయకులు మందాడి హనుమంతరావు, మందాడి వెంకటేష్, మహేష్, వినోద్కుమార్, దేవండ్ల వెంకయ్య, వెంకటేశ్వర్లు, బండారు లక్ష్మయ్య, తిరుపతి వెంకయ్య, బొజ్జ చంద్ర, యనమల బాలయ్య, చల్లా వెంకటయ్య, కొల్లి గంగరాజు, ఉలవపాడుకు చెందిన దాసరి వెంకటరావు, పాలకీర్తి శ్రీనివాసులు, మద్దసాని నవీన్కృష్ణ యాదవ్, రావినూతల రాజా, గొత్తుల శ్రీనివాసులు, జి. ఏడుకొండలు, గుడ్లూరు మండలం చేవూరుకి చెందిన ఉప్పు వెంకటేష్, నక్కల వినోద్, దారకానిపాడుకు చెందిన చల్లా రత్తయ్య, కందుకూరు మండలం కోవూరుకి చెందిన కోవూరు శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు.