Malladi Vishnu: వైసీపీనీ వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే మల్లాది విష్ణు..! అధిష్టానం బుజ్జగింపులు!
ABN , Publish Date - Jan 09 , 2024 | 07:36 PM
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జీ పోరు వ్యవహారం తాడేపల్లికి చేరింది. ఇటీవలే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జీగా మల్లాది విష్ణును సీఎం జగన్ తప్పించారు.
![Malladi Vishnu: వైసీపీనీ వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే మల్లాది విష్ణు..! అధిష్టానం బుజ్జగింపులు!](https://media.andhrajyothy.com/media/2023/20231205/jagan_vishnu_65580e5015.jpg)
తాడేపల్లి: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జీ పోరు వ్యవహారం తాడేపల్లికి చేరింది. ఇటీవలే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జీగా మల్లాది విష్ణును సీఎం జగన్ తప్పించారు. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జీగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను సీఎం నియమించారు. ఇన్ఛార్జీ నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలక బునారు.
వైసీపీనీ వీడేందుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిద్ధమయ్యారు. తన అనుచరులను రాజీనామాలకు మల్లాది విష్ణు సిద్దం చేశారు. మల్లాది విష్ణును వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. మల్లాది విష్ణును ప్రాంతీయ సమన్వయకర్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కలిసి చర్చలు జరిపారు. మల్లాది విష్ణును సీఎం జగన్ వద్దకు నేతలు తీసుకువచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాదివిష్ణులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఇద్దరూ కలసి ఉండేలా సీఎం చర్చలు జరుపుతున్నారు.