ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం : టీడీపీ
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:06 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు దేశాయి మాదవరావు, క్లస్టర్ ఇన్చార్జి, మాజీ సర్పంచ్ కాశీంవలీ అన్నారు.
నందవరం, ఏప్రిల్27: ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు దేశాయి మాదవరావు, క్లస్టర్ ఇన్చార్జి, మాజీ సర్పంచ్ కాశీంవలీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి పత్తిపాటి నాగరాజుతోనే అభివృద్ధి సాద్యమన్నారు. శనివారం పూలచింత, మాచాపురం గ్రామాల్లో పూలచింత సర్పంచ్ అక్కమాంబదేవి, బండేగురుస్వామి, మాచాపురంలో మాజీ సర్పంచ్ కాశీంవలి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు. టీడీపీ మండల నాయకులు మాజీ జడ్పీటీసీ ముగతి ఈరన్నగౌడు, గురురాజారావు, మండల పార్టీ కన్వీనర్ డీవీ రాముడు ఇంటింటికి తిరిగి బాబు ష్యూరిటీ-భవిషత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీకి ఓటమి తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీంవలీ, రైస్మిల్ నారాయణరెడ్డి, నాగరాజుగౌడు, గురురాజారావు, మాచాపురం వలీ, ధర్మాపురం గోపాల్, వెంకట్రాముడు, నాగేష్, నరసింహారెడ్డి, చిన్నన్న, భాస్కర్ పాల్గొన్నారు.