యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:23 AM
పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన హుశేన్ వలి(20) అనారోగ్యంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బేతంచెర్ల, ఏప్రిల్ 18: పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన హుశేన్ వలి(20) అనారోగ్యంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. సంజీవనగర్ కాలనీకి చెందిన పెద్ద హుశేన్, షేకూన్బీ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు హుశేన్వలి పట్టణంలోని పాతబస్టాండులో ఒక ఎలక్ర్టా నిక్ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే స్పందించలేదని అనుమానం వచ్చి రోడ్డుపక్కన ఉన్న ఇంటికి వెళ్లి చూడగా.. దానికి ఉరి వేసుకుని కనిపించా డని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరు కుని యువకుడి ఆత్మహత్యకు గల కారాణాలు తెలుసుకున్నారు.