వైసీపీ నాయకుడా.. మజాకా !
ABN , Publish Date - May 01 , 2024 | 11:51 PM
అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చని వైసీపీ నాయకుడు నిరూపించాడు. అది దేవాలయ భూమి కావచ్చు.
ఆలయ మాన్యంలో మట్టి రోడ్డు
నిర్లక్ష్యంలో దేవదాయశాఖ అధికారులు
రుద్రవరం, మే 1 : అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చని వైసీపీ నాయకుడు నిరూపించాడు. అది దేవాలయ భూమి కావచ్చు. మరేదైనా కావచ్చు. చేయాలనుకున్న పని చేసేశాడు. రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామ పరిధిలో ఈశ్వర, ఆంజనేయ, రామస్వామి దేవాలయాలకు సర్వేనెం.529/2 ఎల్పీనెం. 929లో సుమారు 3 ఎకరాల మాన్యం ఉంది. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడి భూమి ఉంది. తన భూమిలోకి వెళ్లడానికి దేవాలయ భూమిలో మట్టి రోడ్డు వేశాడు. దేవదాయశాఖ అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం మట్టిరోడ్డు వేశాడని తెలిసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.