Share News

రాయలసీమకు వైసీపీ చేసిందేమీ లేదు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:30 AM

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ ఆరోపించారు.

రాయలసీమకు వైసీపీ చేసిందేమీ లేదు

డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌ ధ్వజం

డోన్‌(రూరల్‌), మార్చి 21: వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ ఆరోపించారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ సమన్వయకర్త గార్లపాటి మద్దిలేటితో కలిసి లక్ష్మీనరసింహ యాదవ్‌ మాట్లాడారు. కర్నూలు జిల్లాను న్యాయ రాజధాని పేరుతో వైసీపీ ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలో ఒక్కటి తాగునీటి ప్రాజె క్టును పట్టించుకోలేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాయలసీమ ప్రాంత వాసులు ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌తోనే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ సమన్వయకార్యకర్త గార్లపాటి మద్దిలేటితో పాటు మండలాల నాయకులు జనార్దన్‌ నాయక్‌, సుబ్బయ్య, వడ్డెరాజశేఖర్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:30 AM