Share News

సైనికుల్లా పని చేయండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 AM

జగన్‌ను గద్దె నుంచి దించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపు ఇచ్చారు.

సైనికుల్లా పని చేయండి

టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

ఆదోని, ఏప్రిల్‌ 27: జగన్‌ను గద్దె నుంచి దించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపు ఇచ్చారు. శనివారం పట్టణంలోని 14, 25వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు, ఆదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై ఛార్జిషీట్‌ విడుదల చేశారు. గత ఎన్నికల్లో తన అన్న జగన్‌ను గెలిపించాలని ప్రచారం చేసిన చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్‌కు ఓటు వెయ్యొద్దని ప్రచారం చేయడం జగన్‌ అరాచక పాలనకు నిదర్శమన్నారు. ఐదేళ్ల పాటు జగన్‌ నియంతలా పాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో జగన్‌ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేసే చంద్రన్న పాలన కావాలో, విఽధ్వసం చేసే జగన్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి మల్లప్పతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే

ఆస్పరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే సాధ్యమని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల కురువ నాగరాజు అన్నారు. శనివారం మండలంలోని కైరుప్పల, పుప్పాలదొడ్డి, అటేకల్‌ గ్రామాలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని సమస్యలను తెలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్‌, శేషి రెడ్డి, రామకృష్ణ బసవరాజు, మాలింగ, వడ్డే వీరేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:08 AM