Share News

టీడీపీ జెండా ఎగరేస్తాం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:35 AM

కోడుమూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని పార్టీ కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు.

 టీడీపీ జెండా ఎగరేస్తాం

కోడుమూరు టీడీపీ ఆభ్యర్థి బొగ్గుల దస్తగిరి

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 17: కోడుమూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని పార్టీ కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం కోడుమూరులో జరిగిన ర్యాలీ విజయవంతం కావడంతో జీర్ణించు కోలేక సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు రాస్తూ శునాకానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ పత్రికపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. తాను దైవదర్ళనానికి వెళితే తనపు తప్పుడు కథనాలు ప్రచురించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. . కోడుమూరు నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియా చేస్తూ కోట్లలో అక్రమంగా దోచుకుంటున్న నాయకుల గురించి ఎందుకు కథనాలు రాయడం లేదన్నారు. టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డి.జేమ్స్‌ మాట్లాడుతూ బొగ్గుల దస్తగిరి మనోభావాలు దెబ్బతిసే విధంగా తప్పుడు వార్తలు రాస్తున్న సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

యువతకు ఉద్యోగాల్లేవు

కోడుమూరు(రూరల్‌): రాష్ట్రంలో యువతకు ఉద్యోగా ల్లేవని కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం రాత్రి ప్యాలకుర్తి గ్రామంలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జనసేన నాయ కుడు ఆకెపోగు రాంబాబు, టీడీపీ నాయకులు రంగన్న, మహ్మద్‌రఫీ, దోని క్రిష్ణ, లారీ విజయ్‌, వెంకటేశ్వర్లు, తిమ్మన్న, ఈరన్న, షేక్షావలి, ఆరీఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:35 AM