Share News

ఓటరు చూపంతా టీడీపీ వైపే

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:53 AM

రాష్ట్రంలో ఓటరు చూపు టీడీపీ వైపు ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

ఓటరు చూపంతా టీడీపీ వైపే
భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరిన కార్యకర్తలు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

రుద్రవరం, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో ఓటరు చూపు టీడీపీ వైపు ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం సాయంత్రం రుద్రవరంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో బోసామణి, రాజ్‌కుమార్‌, చంటి, విక్రం, ఆనంద్‌, వినోద్‌, క్రిష్ణ, మోసా, అభిషేకం, ప్రియాంక, శ్రీలక్ష్మి, పల్లవి, పుష్పలత మరో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు అరాచకాలను ఎదుర్కొంటూ టీడీపీపై ఉన్న నమ్మకంతో నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారన్నారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. వైసీపీ పాలనలో ప్రజలు విసుగెత్తి చరమ గీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో నిరుపేదలు సమ స్యలతోనే కొట్టువిట్టాడుతున్నారన్నారు. కుళాయిలు, తాగునీటి సమస్య, ఇళ్లస్థలా లు లేక నిరుపేదలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమం లో ఆలమూరు నారాయణ, రంగనాయకులు, పోలా గురుమూర్తి, ఎస్సీ సెల్‌ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు, చంద్ర, శ్రీను, ఐటీడీపీ ఇన్‌చార్జి గురప్ప తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:53 AM