Share News

వైసీపీ నాయకుడా మజాకా

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:58 PM

మండలంలోని టి.లింగందిన్నె గ్రామంలో ఓ వైసీపీ నాయకుడు రామాలయం భూమిలో బోరు వేశారు.

వైసీపీ నాయకుడా మజాకా

రామాలయం భూమిలో బోరు

పోలీసుస్టేషన్‌లో

ఫిర్యాదు చేసిన సర్పంచ్‌

రుద్రవరం, జూన్‌ 9: మండలంలోని టి.లింగందిన్నె గ్రామంలో ఓ వైసీపీ నాయకుడు రామాలయం భూమిలో బోరు వేశారు. సుమారు ఐదు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా బోరు వేసి రెండు రోజుల క్రితం మోటారు ఏర్పాటు చేశాడు. సమీపంలో ఉన్న తన పొలంలోకి నీరు సరఫరా చేసేందుకు పైపులైను వేసే ప్రయత్నం ప్రారంభించాడు. గ్రామస్థులకు విషయం తెలియడంతో అభ్యంతరం తెలిపారు. వైసీపీ నాయకుడు వేసిన బోరును గ్రామ కమిటీ పరిశీలించిన అనంతరం గ్రామ సర్పంచ్‌ లక్ష్మీదేవి రుద్రవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - Jun 09 , 2024 | 11:58 PM