టీడీపీతోనే ముస్లింల సంక్షేమం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:24 PM
టీడీపీ ద్వారానే ముస్లింల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.
కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
హొళగుంద, ఏప్రిల్ 26: టీడీపీ ద్వారానే ముస్లింల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం హొళగుందలో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ అబ్దుల్ సుభాన్ సహా వందకు పైగా ముస్లిం కుటుంబాలకు చెందిన వారు ఆలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బి.వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బస్తిపాటి నాగరాజు, ఆలూరు అభ్యర్థి బి.వీరభద్రగౌడ్ పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగాయని అన్నారు. హజ్ యాత్రకు ఆర్థిక సాయం టీడీపీ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. టీడీపీ పథకాలు ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా వీరభద్ర గౌడ్ తీసుకుంటామని వివరించారు.