మద్దిలేటి స్వామి క్షేత్ర ఆదాయం రూ.4.32 లక్షలు
ABN , Publish Date - May 12 , 2024 | 12:37 AM
మద్దిలేటి నరసింహస్వామి క్షేత్ర ఆదాయం రూ.4.32 లక్షలు సమకూరినట్లు ఉప కమిషనర్, ఆలయ నిర్వహణాధికారి నరసింహులు, చైర్మన్ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు.

బేతంచెర్ల, మే 11: మద్దిలేటి నరసింహస్వామి క్షేత్ర ఆదాయం రూ.4.32 లక్షలు సమకూరినట్లు ఉప కమిషనర్, ఆలయ నిర్వహణాధికారి నరసింహులు, చైర్మన్ సీతారామచంద్రుడు శనివారం తెలిపారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాల నుంచే గాక. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు వేకువజాము నుంచే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, గండదీపాలు, ప్ర త్యేక పూజలు చేసి పుట్టు వెంట్రుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.