బైకు దగ్ధం
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:51 PM
మండలంలోని ఎ.కోడూరు వద్ద గడ్డి లారీకి విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి.
బండిఆత్మకూరు, ఏప్రిల్ 18: మండలంలోని ఎ.కోడూరు వద్ద గడ్డి లారీకి విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి అనంతపురం జిల్లా నార్పల మండలానికి మండలంలోని ఏ కోడూరు నుంచి లారీలో గడ్డి చుట్టలు లోడ్ చేసుకుని వెళ్తుండగా విద్యుత్ తీగలు తాకి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎ.కోడూరు గ్రామస్థులు డ్రైవర్ను గ్రామం వెలుపలకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మంటలు మరింత వ్యాపించి కాలుతున్న గడ్డి కట్టలు నంద్యాల, ఆత్మకూరు ప్రధాన రహాదారి వెంట పడ్డాయి. ఎదురుగా నంద్యాల మండలం కొత్తపల్లె నుంచి హుస్సేన్ అనేవ్యక్తి భార్య, బిడ్డతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం వెళ్తుండగా, కాలుతున్న లారీ దాటే సమయంలో మోటార్ బైక్పై కాలుతున్న గడ్డి కట్ట పడింది. వారంతా బైక్ నుంచి కిందకు దూకారు. ప్రమాదంలో బైక్ కాలిపోయింది. మహిళకు కాలిన గాయాలు కావటంతో వెంటనే స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పి వేశారు.