టీడీపీతోనే యువతకు భవిష్యత్తు: శబరి
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:56 AM
యువత భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ రావాలని నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు.
మిడుతూరు, ఏప్రిల్ 24: యువత భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ రావాలని నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. మండలంలోని కలమందలపాడు, మాసపేట, కడుమూరు గ్రామాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులకు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాయ మాటలు చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయకుండా జగన్ యువతను మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించానికోరారు. తువ్వా భగీరథ రెడ్డి, గుండం స్వామి రెడ్డి, బాబు, రమణయ్య, వీరా రెడ్డి, రామసుబ్బా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.