నేడు బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ABN , Publish Date - May 26 , 2024 | 12:12 AM
బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది, ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు.
కర్నూలు(కల్చరల్), మే 25: బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది, ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ బ్రాహ్మణ సంఘాల నాయ కులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండేల్ చంద్రశే ఖర్ మాట్లా డుతూ పేద బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఏటా ప్రతిభా పురస్కా రాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పెద్ద మార్కెట్ సమీపంలోని ఉత్తరాది మఠంలో ఆదివారం సాయంత్రం ఐదు గంట లకు నగరానికి చెందిన బ్రాహ్మణ ప్రముఖులచే ఈ పురస్కారాలు విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపా రు. ఈసమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు సీవీ దుర్గాప్రసాద్, కంచు గం టల శ్యామసుందరశర్మ, శ్రీనివాసరాజు, రవిచంద్రశర్మ, డి.ఆనందరావు పాల్గొన్నారు.