Share News

అహోబిలంలో సుందరకాండ పారాయణం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:38 AM

అయోధ్యలో భవ్య రామ మందిర ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శనివారం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వేదపండితులు సంక్షిప్త సుందరకాండ పారాయణం చేశారు.

అహోబిలంలో సుందరకాండ పారాయణం
సుందరకాండ పారాయణం చేస్తున్న వేద పండితులు

ఆళ్లగడ్డ, జనవరి 20: అయోధ్యలో భవ్య రామ మందిర ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శనివారం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వేదపండితులు సంక్షిప్త సుందరకాండ పారాయణం చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో వేదపండితులు పాల్గొని రామాయణంలోని సుందరకాండ శ్లోకాలు చదివారు.

పూజలందుకున్న అహోబిలేశుడు

ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామానికి శనివారం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకీ చేరుకుంది. గ్రామంలోని పెద్దదేవాలయం తెలుపు వద్ద పల్లకి విడిది చేయడంతో ఆయా ప్రాంతాలలోని ప్రజలు మేళతాళాలతో వెళ్లి భక్తి, శ్రద్ధలతో పూజలు చేశారు. మర్రిపల్లె గ్రామంలో ఆదివారం పూజలందుకోనున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:38 AM