Share News

బోగస్‌ సర్టిఫికెట్ల ఏరివేతకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:37 AM

వైద్యఆరోగ్య శాఖలో బోగస్‌ సర్టిఫికెట్ల ఏరివేతకు రాష్ట్ర కేబినెట్‌ చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నమెంటు ఇన్‌స్టి ట్యూట్‌ టైన్స్‌ కాంట్రాక్టు మల్టీ పర్సస్‌ హెల్త్‌ అసిస్టెం ట్‌ (మగ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్య క్షుడు యర్రపురెడ్డి విశ్వనాథ్‌ రెడ్డి కోరారు.

బోగస్‌ సర్టిఫికెట్ల ఏరివేతకు చర్యలు తీసుకోవాలి

కర్నూలు(హాస్పిటల్‌), జూలై 30: వైద్యఆరోగ్య శాఖలో బోగస్‌ సర్టిఫికెట్ల ఏరివేతకు రాష్ట్ర కేబినెట్‌ చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నమెంటు ఇన్‌స్టి ట్యూట్‌ టైన్స్‌ కాంట్రాక్టు మల్టీ పర్సస్‌ హెల్త్‌ అసిస్టెం ట్‌ (మగ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్య క్షుడు యర్రపురెడ్డి విశ్వనాథ్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు కర్నూలులోని ఆంధ్రప్రధేశ్‌లో లోకాయుక్త సంస్థ సమీ పంలో మంగళవారం ఓ హోటల్‌లో మధ్యాహ్నం బాధితులతో సమావేశమ య్యారు. ఈసందర్భంగా విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 2న జరిగే కేబి నెట్‌ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖలో ఫేక్‌ సర్టిఫికెట్ల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి రాష్ట్ర ఉన్నతాధికా రులను కలవాలని సభ్యులు తీర్మానం చేసినట్లు తెలిపారు. బోగస్‌ సర్టిఫికెట్లు ఏరివేయాలని ఎంపీహెచ్‌ఏ(ఎం) ముత్యాల బాలుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు 30 మంది బాధితులు జడ్జి ముందు బోగస్‌ సర్టిఫికెట్లు గురించి వివరించారు. కేసును సెప్టెంబరు 2కు జడ్జి వాయిదా వేశారు.

Updated Date - Jul 31 , 2024 | 12:37 AM