వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:18 AM
వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఇసుక, గ్రానైట్, మైనింగ్ పేరుతో వైసీపీ నాయకులు రూ.లక్షల కోట్ల దోపిడీ చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
![వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు
కోసిగి, జనవరి 11: వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఇసుక, గ్రానైట్, మైనింగ్ పేరుతో వైసీపీ నాయకులు రూ.లక్షల కోట్ల దోపిడీ చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. గురువారం జుమాలదిన్నెలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన టీడీపీ అధినేత పత్తికొండలో రా కదలిరా బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ బహిరంగా సభకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో చంద్ర బాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. టీడీపీ పాల నలో రాష్ట్రంలో స్వర్ణయుగం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ అందర్నీ ముంచే శాడని విమర్శించారు. ప్రభుత్వ వేధింపులతో ఎన్నో కంపెనీలు పారిపోయాయని ఆరోపించారు. యువత భవిష్యత్తుకు టీడీపీ గ్యారెంటీ అని టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలన్నారు.