చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: జయసూర్య
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:50 AM
చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య అన్నారు.
మిడుతూరు, ఏప్రిల్ 24: చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య అన్నారు. బుధవారం మండలంలోని చెరుకుచెర్ల గ్రామంలో సర్వోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. మండల కన్వీనర్ కాతా రమేశ్ రెడ్డి, మాండ్ర సురేద్రనాఽథ్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, శివరామి రెడ్డి, శేఖర్, వతి, ఇద్రూస్, రెహమాన్, రఫి, మగ్బూల్ అహమ్మద్, భూషణం, ఆనందం, స్వాములు, వెంకటరత్నం పాల్గొన్నారు.
నందికొట్కూరు: రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ నాయకుడు మాండ్ర లింగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 11వ వార్డు ఇన్చార్జి కృష్ణారెడ్డి, మల్లికార్జున్రెడ్డి, లింగమయ్య ఆధ్వర్యంలో లింగారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలతో మహిళార్థికాభివృద్ధికి కృషి చేశారన్నారు. టీడీపీ నాయకులు మాండ్ర విష్ణు మోహన్రెడ్డి, మాండ్ర పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, ముర్తుజావలి, సురేష్, వేణుగోపాల్, షకీల్ అహ్మద్, శాంతరాజు, దావీదు, మీనాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వృద్ధులకు పింఛన్ను రూ.4 వేలు చేసి ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తామని టీడీపీ నాయకులు మాండ్ర లింగారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని 10వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. పింఛన్ 200 నుంచి రూ.2000 చేసింది చంద్రబాబే కదా నాయన అని వృద్ధురాలు అన్నారు.
టీడీపీ అభ్యర్థి జయసూర్య మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు సమర్పించారు. టీడీపీ తరపున బండి జయరాజు సమర్పించారు. జయసూర్య వెంట మాండ్ర లింగారెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు దామోదర్రెడ్డి, రవి ఉన్నారు.