నేడు కలెక్టరేట్లో స్పందన
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:16 AM
ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నంద్యాల (కల్చరల్), మార్చి 3: ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందనకు సోమవారం ఉదయం 9.30 గంటలకంతా జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంతోపాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.