Share News

టీడీపీతోనే బీసీలకు సామాజిక భద్రత: గౌరు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:39 AM

కల్లూరు, ఏప్రిల్‌ 16: తెలుగుదేశం పార్టీలోనే బీసీ కులాలకు సామాజిక భద్రత ఉంటుందని నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

టీడీపీతోనే బీసీలకు సామాజిక భద్రత: గౌరు

కల్లూరు, ఏప్రిల్‌ 16: తెలుగుదేశం పార్టీలోనే బీసీ కులాలకు సామాజిక భద్రత ఉంటుందని నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు మండలం కొంగన పాడులో చేపట్టిన జయహో బీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై ప్రసంగించారు. చంద్రబాబును సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన బీసీ నాయ కులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. బీసీలంతా కలసి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున టీడీపీ మండల అధ్యక్షుడు డి.రామాం జనేయులు, ఉలిందకొండ టీడీపీ నాయ కుడు ఈవీ.రమణ, వినోద్‌కుమార్‌, రంగ స్వామిరెడ్డి, మాదేష్‌, ధనుంజయ, కాసాని మహేష్‌గౌడ్‌, గంగాధర్‌గౌడ్‌, శేషన్న, శ్రీరాములు, మురళి, పర్ల గోరంట్ల, డీలర్‌ మాదన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:39 AM