Share News

వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:39 AM

శ్రీశైలక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణంను దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

 వైభవంగా సీతారాముల కల్యాణం

శ్రీశైలం, ఏప్రిల్‌ 17: శ్రీశైలక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణంను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. కల్యాణోత్సవంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. కల్యాణోత్సవంలో సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే క్షేత్రపరిధిలోని లలితాంబికా వాణిజ్య సముదాయంలో వ్యాపారస్తులు సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 12:39 AM