బాలనాగిరెడ్డికి షాక్..
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:39 AM
మంత్రాలయం నియోజవర్గ వైసీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి షాక్ ఇచ్చారు.
టీడీపీలోకి వైసీపీ నాయకులు
కర్నూలు(అర్బన), అక్టోబరు 9: మంత్రాలయం నియోజవర్గ వైసీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి షాక్ ఇచ్చారు. కోసిగి మండలం దోడ్డి బెళగల్ గ్రామానికి చెందిన బాలనాగిరెడ్డి అనుచరులు ఈడిగ చిన్న భీమయ్యగౌడ్, ఈడిగ చిన్న మునెయ్య గౌడ్, ఈడిగ తిరుమలేష్ గౌడ్, ఈడిగ గోవింద్ గౌడ్, ఈడీగ నాగరాజు,ఈడిగ నగేష్, ఈడిగ తిక్యయ్యతో పాటు మరో 200 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం కర్నూలులో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానిం చారు. ఈడిగ గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మారి గోవింద్ గౌడ్, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు సల్మాన రాజు, సిద్ధప్ప, ఎస్సీసెల్ బసవ లింగప్ప, అంపయ్య, నగేష్ పాల్గొన్నారు.