ఆదోని జీజీహెచ్ ఏడీగా శైలజ
ABN , Publish Date - Jan 21 , 2024 | 12:53 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న ఎ.శైలజకు ఏడీగా పదోన్నతి లభించింది.
![ఆదోని జీజీహెచ్ ఏడీగా శైలజ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(హాస్పిటల్), జనవరి 20: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న ఎ.శైలజకు ఏడీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెను కొత్తగా ఏర్పడిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఏడీగా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జీజీహెచ్ ఏవోగా ఉన్న ఆమె శనివారం రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఏడీకి సూపరింటెండెంట్ కుమారస్వామి, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలి కారు. ఈ మేరకు ఆదోని జీజీహెచ్ ఏడీగా ఆమె విధుల్లో చేరారు.