టీడీపీలో చేరిన కొర్రపొలూరు సర్పంచ్
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:36 PM
మండలంలోని కొర్రపొలూరు గ్రామ సర్పంచ్ మాలిక్బాషా, గ్రామానికి చెందిన 150 కుటుంబాలు శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ నందికొట్కూరు ఇన్చార్జి గౌరు వెంకట్రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
![టీడీపీలో చేరిన కొర్రపొలూరు సర్పంచ్](https://media.andhrajyothy.com/media/2024/20240604/8_gadivemula_2f_d8f1881a9d.gif)
గడివేముల, జూన్ 8: మండలంలోని కొర్రపొలూరు గ్రామ సర్పంచ్ మాలిక్బాషా, గ్రామానికి చెందిన 150 కుటుంబాలు శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ నందికొట్కూరు ఇన్చార్జి గౌరు వెంకట్రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరికి గౌరు దంపతులు పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం కొర్రపొలూరు సర్పంచ్ మాలిక్బాషా మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని అన్నారు. గౌరు కుటుంబంపై నమ్మకంతోనే తాము వైసీపీని వీడి టీడీపీలో చేరామన్నారు. గ్రామానికి చెందిన భూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.