మిద్దె కూలి మహిళ మృతి
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:32 PM
పాణ్యంలోని బోయపేటలోని మిద్దె కూలి శుక్రవారం రాత్రి రామినేని లక్ష్మీదేవి (59) మృతి చెందినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
![మిద్దె కూలి మహిళ మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాణ్యం, జూన్ 8: పాణ్యంలోని బోయపేటలోని మిద్దె కూలి శుక్రవారం రాత్రి రామినేని లక్ష్మీదేవి (59) మృతి చెందినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడవడంతో మట్టి మిద్దె కూలినట్లు తెలిపారు. ఇంట్లో కూర్చొని ఉండగా హఠాత్తుగా మిద్దె కూలినట్లు బంధువులు తెలిపారు. వీఆర్వో బీరేంద్ర, వీఆర్ఏలు మధుశేఖర్, విజయ్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.