Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - May 15 , 2024 | 12:19 AM

ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా.. ద్విచక్రవాహనం ఢీ కొనడంతో మృతి చెందిన ఘటన నందికొట్కూరు పట్టణం లో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నందికొట్కూరు, మే 14: ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా.. ద్విచక్రవాహనం ఢీ కొనడంతో మృతి చెందిన ఘటన నందికొట్కూరు పట్టణం లో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని హాజీ నగర్‌కు చెందిన మహ్మద్‌ రఫి కుమారుడు హారీఫ్‌ (18) సోమవారం రాత్రి పట్టణంలో పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. అటుగా వస్తున్న కొణిదేల శ్రీనివాసులు ద్విచక్రవాహనం ఢీ కొనడంతో హరీఫ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 12:19 AM