వైసీపీ నాయకుడు అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:46 PM
అనుమానాస్పద స్థితిలో వైసీపీ నాయకుడు జంగంపాడు రాజు మృతి చెందారు.
నందికొట్కూరు, ఏప్రిల్ 26: అనుమానాస్పద స్థితిలో వైసీపీ నాయకుడు జంగంపాడు రాజు మృతి చెందారు. వివరాలివీ.. నందికొట్కూరు మండలం జంగంపాడుకు చెందిన రాజు ఈనెల 23వ తేదీ రాత్రి 11 గంటలకు నందికొట్కూరు పట్టణంలో శారదా లాడ్జిలో రూమ్ బాడుగకు తీసుకొని ఉన్నారు. రాజు తల్లిశేషమ్మ చివరగా 25వ తేదీ ఫోన్ చేయగా నందికొట్కూరులోనే ఉన్నాయని తెలిపారు. 24వ తేదీన మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాజు బయటి నుంచి ఆహారం, వాటర్ బాటిళ్లు తీసుకొని రూములోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రూమును శుభ్రం చేసేందుకు వెళ్లి బాయ్ ఎంత సేపు తలుపు కొట్టినా తెరవకపోవడంతో పట్టణ సీఐ ప్రకాష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన లాడ్జికి చేరుకొని తలుపులను పగలగొట్టి చూడగా రాజు రక్తపు మడుగులో పడి మృతి చెందినట్లు గురించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూమ్లో ఉన్న పరిస్థితులను గమనించిన పోలీసులు బిర్యాని, నాలుగు మందు బాటిళ్లు ఉన్నట్లు గమనించారు. రాజు తల్లి శేషమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.