ప్రాణం తీసిన రసాయన పౌడర్
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:16 AM
పట్టణంలోని వాల్మీకినగర్లో నివసిస్తున్న పద్మావతి(49) ప్రమాదవశాత్తు మృతి చెందారు.
ప్యాకెట్ ఓపెన్ చేస్తుండగా నోట్లోకి వెళ్లడంతో మహిళ మృతి
నందికొట్కూరు మార్చి 27: పట్టణంలోని వాల్మీకినగర్లో నివసిస్తున్న పద్మావతి(49) ప్రమాదవశాత్తు మృతి చెందారు. బుధవారం ఉదయం ఇంటి ముందు కల్లాపి చల్లేందుకు అందులో కలిపే రంగుల కవర్ను పద్మావతి ఓపెన్ చేశారు. దీంతో ఆ ప్యాకెట్లో ఉండే కెమికల్ నోట్లోకి, ముక్కులోకి వెళ్లడంతో వాంతులు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పద్మావతి చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు.