Share News

రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడి మృతి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:44 AM

రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు బి. నరేష్‌ మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడి మృతి

వెల్దుర్తి, ఏప్రిల్‌, 24: రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు బి. నరేష్‌ మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తిలో జరిగింది. బుధవారం సాయంత్రం నరేష్‌, మిత్రుడు రామంజనేయులతో కలసి భైక్‌ పై జాతీయ రహదారి-44లో వెళుతుండగా తమిళనాడుకు చెందిన లారీ వచ్చి ఢీ కొట్టింది. గాయపడిన ఇద్దరిని స్థానికులు హైవే అంబులెన్స్‌లో కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. అప్పటికే పాత్రికేయుడు నరేష్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవ్యక్తి రామాంజనేయులు కాలు విరిగింది. మృతిచెందిన నరేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు కలరు. విలేఖరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజలు తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:44 AM