Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 AM

కుంటనహల్‌లో బుధవారం ఓ మహిళ ఆత్మ హత్య చేసుకుంది.

మహిళ ఆత్మహత్య

కౌతాళం, ఏప్రిల్‌ 24: కుంటనహల్‌లో బుధవారం ఓ మహిళ ఆత్మ హత్య చేసుకుంది. నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన శేకన్‌(32)కు కుంటనహాల్‌ గ్రామా నికి చెందిన ఇలియాసాబ్‌కు 13ఏళ్ల క్రితం వివాహమైంది. శేకన్‌ తరచూ పుట్టింటికి పోతుండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతూ ఉండేది. మంగళ వారం కూడా గొడవ పడినట్లు తెలుస్తోంది. రాత్రి అందరూ నిద్ర పోయాక శేకన్‌ ఇంటి ముందర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇలియాసాబ్‌ నిద్రలేచి చూస్తే చెట్టుకు వేలాడుతున్న భార్య మృతదేహం కనిపించింది. మృతురాలి తల్లి మూబూబ్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసు పత్రికి తరలించినట్లు కౌతాళం హెడ్‌కానిస్టేబుల్‌ సోమ్లనాయక్‌ తెలిపారు. మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:42 AM