Share News

సంగమేశ్వరం వద్ద పెరుగుతున్న కృష్ణాజలాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:40 PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న సప్తనదుల సంగమేశ్వర ఆలయం వద్ద స్వల్పంగా కృష్ణాజలాలు పెరుగుతున్నాయి.

సంగమేశ్వరం వద్ద పెరుగుతున్న కృష్ణాజలాలు

కొత్తపల్లి, జూన్‌ 8: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న సప్తనదుల సంగమేశ్వర ఆలయం వద్ద స్వల్పంగా కృష్ణాజలాలు పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో శనివారం ఎగువ ప్రాంతాల నుంచి కొద్దిగా వరద నీరు శ్రీశైలం రిజర్వాయరుకు వచ్చి చేరుతున్నది. ఈ మేరకు సంగమేశ్వర ఆలయంలో రెండు అడుగుల మేర వరద జలాలు పెరిగినట్లు ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుతుండటంతో మత్స్యకారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:40 PM