Share News

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:19 AM

గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కారానికే ప్రభు త్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుం దని తహసీ ల్దార్‌ విద్యాసాగర్‌ అన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
పూడిచెర్లలో వినతులు స్వీకరిస్తున్న తహసీల్దార్‌

ఓర్వకల్లు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కారానికే ప్రభు త్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుం దని తహసీ ల్దార్‌ విద్యాసాగర్‌ అన్నారు. బుధవారం మండలంలోని పూడిచెర్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూముల కొలతలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆనలైనలో భూములు ఎక్కించుట, భూసర్వేలు తదితర వాటిపై 17 అర్జీలను రైతులు సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ రైతులు ఇచ్చిన అర్జీలను ఆనలైనలో ఎక్కించి త్వరిత గతిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఈవో మద్దిలేటి, సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం, వీఆర్వోలు నాగరాజు, బాల మద్దిలేటి, మోహన, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, గ్రామ నాయకులు పుల్లారెడ్డి, పల్లెం తిరుపాలు, ప్రకాశం, శివుడు, శివ, బోయ తిరు పాలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గూడూరు: రెవెన్యూ సదస్సులతో రైతుల భూ సమ స్యలు పరిష్కారం అవుతాయని తహసీల్దార్‌ రామాంజ నేయులు అన్నారు. బుధవారం మండలంలోని కె.నాగలా పురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరించారు. ఈ సమావేశంలో సర్పంచ జె నయోమి, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ రెడ్డి, ఆర్‌ఐ, వీఆర్‌వొలు, రైతులు పాల్గొన్నారు.

సి.బెళగల్‌: మండలంలోని కొత్తకోట గ్రామంలో బుధవారం వీఆ ర్వో శ్రీనివాసులు అధ్యక్షతన రెవె న్యూ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో డిప్యూటీ తహసీల్దార్‌ పురుషోత్తం, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, సర్వేయర్‌ నాగభూ షణం, వీఆర్వోలు పాల్గొన్నారు.

కల్లూరు: భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నోడల్‌ ఆఫీసర్‌, సివిల్‌ సప్లయ్‌ డివిజనల్‌ మేనేజర్‌ నాగసుధ కోరారు. బుధవారం కల్లూరు మండలం యాపర్లపాడు సచివాలయంలో తహసీల్దారు కె.ఆంజనేయులు అధ్య క్షతన చేపట్టిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ప్రజలు వివిద సమస్యలపై 20 అర్జీలను అధికారులకు అందజేశారు. రైతులిచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిస్కారం చూపుతామని తహసీల్దారు కె.ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ శ్రీనివాసులు, సర్పంచు వెంకట్రామిరెడ్డి, టీడీపీ నాయకులు వెంకటరమణ, శివారెడ్డి పాల్గొ న్నారు.

Updated Date - Dec 12 , 2024 | 12:19 AM