Share News

ప్రజాహితమే చంద్రబాబు ధ్యేయం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:00 AM

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా హితమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

ప్రజాహితమే చంద్రబాబు ధ్యేయం

డోన్‌, జూన్‌ 11: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా హితమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. మంగళవారం అమరావతిలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, రాష్ట్ర ఈడిగ సాధికార సమితి అమర్నాథ్‌గౌడులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారన్నారు. బుధవారం చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుం డటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డోన్‌ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:00 AM