Share News

నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:17 AM

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని డీఈవో సుధాకర్‌రెడ్డి సూచించారు.

నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో సుధాకర్‌రెడ్డి

గడివేముల, జూలై 4: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని డీఈవో సుధాకర్‌రెడ్డి సూచించారు. గడివేములలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌, గడిగరేవులలోని హైస్కూల్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతికతను ఉపయోగించి బోధన చేయాలని అన్నారు. నిర్ణీత సమయంలో సిలబస్‌ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవోఎస్‌ఎస్‌ డీసీ సత్యనారాయణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:17 AM