Share News

సెక్రటరీలకు పదోన్నతులు

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:02 AM

మార్కెట్‌ కమిటీల్లో పని చేస్తున్న సెక్రటరీలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ చేపట్టారు.

సెక్రటరీలకు పదోన్నతులు

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 13: మార్కెట్‌ కమిటీల్లో పని చేస్తున్న సెక్రటరీలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ చేపట్టారు. శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు మార్కెట్‌ కమిటీలకు మూడవ గ్రేడ్‌ సెక్రటరీలు గా పదోన్నతులు కల్పించిన అధికారులకు పోస్టింగులను కమిషనర్‌ జారీ చేశారు. సహాయ సెక్రటరీలుగా పని చేస్తున్న సుందర్‌రాజును కోడు మూరు మార్కెట్‌ కమిటి సెక్రటరీగా పదోన్నతి కల్పించి పోస్టింగ్‌ ఇచ్చారు. అదేవిధంగా ఆలూరు మార్కెట్‌ కమిటీకి సుకన్య, ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీకి పద్మావతిని నియమించారు. వీరు బుధవారం బాధ్యతలు తీసుకో వాలని కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు కర్నూలు మార్కెటింగ్‌ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు. నంద్యాల జిల్లాలో ఎవరికీ పదోన్న తులు లభించలేదు. మరికొద్ది రోజుల్లో సూపర్‌వైజర్లుగా పని చేస్తున్న కొంత మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులో పని చేస్తున్న కేశవరెడ్డి, శివన్న, నాగేష్‌లకు అదనపు సెక్రటరీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 01:02 AM