రోడ్డు ప్రమాదంలో పూజారికి గాయాలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:55 AM
పట్టణ సమీపంలోని వైభవ్ డాబా దగ్గర 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూజారి గిరిమనోహర్స్వామికి గాయాలయ్యాయి.
ప్యాపిలి, మార్చి 28: పట్టణ సమీపంలోని వైభవ్ డాబా దగ్గర 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూజారి గిరిమనోహర్స్వామికి గాయాలయ్యాయి. ప్యాపిలికి చెందిన గిరిమనోహర్ స్వామి వివాహం జరిపించడానికి గుత్తికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైకుపై ప్యాపిలికి బయలు దేరారు. వైభవ్ డాబా దగ్గకు రాగానే కర్నూలు నుంచి అనంతపురం వైపు వెళ్లుతున్న లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూజారికి గాయాలయ్యాయి. కర్నూలు ఆస్పత్రికి ఆయ నను తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు తెలిపారు.