Share News

పోలింగ్‌ శాతాన్ని పెంచాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:18 AM

గత ఎన్నికల పోలింగ్‌ శాతం కంటే మెరుగైన శాతాన్ని సాధించేలా బీఎల్వోలు కృషి చేయాలని కలెక్టర్‌ జి.సఅజన అన్నారు.

పోలింగ్‌ శాతాన్ని పెంచాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ జి. సృజన

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 26: గత ఎన్నికల పోలింగ్‌ శాతం కంటే మెరుగైన శాతాన్ని సాధించేలా బీఎల్వోలు కృషి చేయాలని కలెక్టర్‌ జి.సృజన అన్నారు. మంగళవారం దేవీ ఫంక్షన్‌ హాలులో పాణ్యం నియోజకవర్గం, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణపై బూత్‌ లెవెల్‌ స్థాయి అధికారులకు, సెక్టోరల్‌ అధికారులకు, ఎంసీసీ బృందాలకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌, పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, కోడుమూరు ఆర్వో శేషిరెడ్డితో కలిసి కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నిక లపై పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గానూ ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎస్పీ జి.కృష్ణ కాంత్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహిం చేం దుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈసమావే శంలో పట్టణ డీఎస్పీ రాజశేఖర్‌బాబు, ట్రైనీ డీఎస్పీ భావన, కల్లూరు తహసీల్దార్‌ మునివేలు, ఓర్వకల్లు గడివేముల, కోడుమూరు ఎంపీడీ వోలు, తహసీ ల్దార్లు, వీఎస్‌టీ, ఎస్‌ఎఫ్‌టీ, బీఎల్వోలు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకూడదు : వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి.సృజన సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యా లయంలో తాగునీటి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై పంచా యతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, నగర పాలక సంస్థ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించా లన్నారు. ఎల్లెల్సీ నుంచి ఆధారపడిన సీపీడబ్ల్యూఎస్‌ పథకానికి సంబం ధించి నీటిని విడుదల చేసుకుని 16 ఎస్‌ఎస్‌ ట్యాంకులలో నీటిని స్టోరేజీ చేసుకుంటున్నారా..? ఒక వేళ ఎల్లెల్సీ నుంచి నీరు రాకపోయినా ఎస్‌ఎస్‌ ట్యాంకులలో స్టోర్‌ చేసుకున్న నీటిని ఎన్ని రోజుల వరకు ఉపయోగిం చుకోవచ్చు అనే వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని అడిగి తెలుసుకు న్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని హ్యాబిలిటేషన్స్‌ ఉన్నాయి.. అందులో జూన్‌ నెల చివరి వరకు ప్రతి రోజు నీటిని ఎన్ని హ్యాబిటేషన్స్‌కి ఇవ్వగలం, రోజు మార్చి రోజు ఎన్ని హ్యాబిటేషన్స్‌కి ఇవ్వగలం, ఏ సోర్సెస్‌ ద్వారా ఇవ్వాలనే విషయాలను ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, జిల్లా పరిషత్‌ అధికారు లు సమన్వయం చేసుకుని రేపటి లోపు వివరాలను తనకు అందజే యాలన్నారు. మండలాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి.. అందులో ఎన్ని రిపేర్లు ఉన్నాయి.. రిపేర్‌ ఉన్న వాటిలో రిపేర్‌ చే యిస్తే.. ఎన్ని పని చేస్తాయనే వివరాలను కూడా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఉపాధి పనులలో మొదటి ప్రాధాన్యతగా ఏప్రిల్‌లో కూలీలతో అన్ని హ్యాబిటేషన్‌ ప్రాంతాలలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎపీఎస్‌పీ డీసీఎల్‌ ఎస్‌ఈ ఉమాపతి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి, డీపీవో నాగరాజు నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:18 AM