‘టీడీపీ మేనిఫెస్టోకు ప్రజల్లో ఆదరణ’
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:47 AM
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున యువత టీడీపిలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అన్నారు.
నంద్యాల (కల్చరల్), మార్చి 28: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున యువత టీడీపిలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అన్నారు. గురువారంనంద్యాల 24వ వార్డు టీడీపీ నాయకులు సాయిరాం రాయల్ ఆధ్వర్యంలో 300 మంది మహిళలు గురువారం టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే నందమూరి నగర్ 37వ వార్డు నుంచి నంద్యాల టీడీపి 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, మాబువల్లి, మణికంఠ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిలో నాజీర్, సమీర్, రజీఫ్, చోటు, ఖాదర్, రవి, గౌస్ ఉన్నారు.