Share News

నేటి నుంచి ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - May 31 , 2024 | 11:46 PM

కర్నూలు జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి జూన్‌ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

నేటి నుంచి ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 31: కర్నూలు జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి జూన్‌ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఓపెన్‌ స్కూల్‌ 10వ తరగతి పరీక్షలకు మొత్తం 930 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ విద్యార్థుల కోసం ఆదోనిలో 1, కర్నూలులో 2, ఎమ్మిగనూరులో 1, పత్తికొండలో 1 మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు కొనసాగుతాయి. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 1,265 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ విద్యార్థుల కోసం ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరగనున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కోసం రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated Date - May 31 , 2024 | 11:46 PM