Share News

వేణుగోపాలుడి అలంకరణలో నృసింహుడు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:23 AM

జ్వాలా నరసింహ స్వామి గురువారం వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనం చేయించారు.

వేణుగోపాలుడి అలంకరణలో నృసింహుడు

నంద్యాల, మార్చి 21(ఆంధ్రజ్యోతి): జ్వాలా నరసింహ స్వామి గురువారం వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనం చేయించారు. అనంతరం చూర్ణాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి ఉత్సవం, అభిషేకం కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. స్వామివారు పొన్న చెట్టు వాహనంపై రాత్రి విహరించారు.

దిగువ అహోబిలంలో..

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ప్రహ్లాద వరద స్వామిని మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తరువాత అభిషేకం నిర్వహించారు. రాత్రి శరభ వాహనంపై వాహనంపై విహరించారు. కాగా ఎగువ అహోబిలంలో శుక్రవారం తిరుమంజనం, గజ వాహనం, తిరు కళ్యాణోత్సవం కార్యక్రమాలను వేదపండితులు నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో వేణుగోపాలస్వామి అలంకారం, చుర్ణాభిషేకం, అభిషేకం, రాత్రి పొన్నచెట్టు వాహనం కార్యక్రమాలను చేపడతారు.

Updated Date - Mar 22 , 2024 | 12:23 AM